జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున బిగ్ బాస్ షోను ఆద్యంతం రక్తి కట్టించాడు. అంకితం నీకే అంకితం అనే టాస్కులో ఇంటి సభ్యులు పాటను నచ్చిన ఇంటి సభ్యులకు అంకితం ఇచ్చారు. కమెడియన్ వెన్నెల కిషోర్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి బయట బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి ఏం అనుకుంటున్నారో వారికి చెప్పాడు. 
 
వెన్నెల కిషోర్ శ్రీముఖికి వాళ్ళింట్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పారు. రాహుల్ పులిహోర కులుపుతున్నావని తగ్గించమని చెబుతాడు కిషోర్. అషు రెడ్డి స్మైల్ కు ఫ్యాన్స్ ఉన్నారని, శివజ్యోతి పాతాళ గంగ అని కామెంట్ చేస్తాడు వెన్నెల కిషోర్. ఎలిమినేషన్ కు ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ కాగా తమన్నా సింహాద్రిని ఎలిమినేట్ చేస్తాడు నాగార్జున. నాగార్జున తమన్నా సింహాద్రిని ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక నిమిషంలో చెప్పమని చెబుతాడు. 
 
తమన్నా సింహాద్రి వరుణ్ ఇతరుల మాటలు ఎక్కువగా వింటాడని అందుకే నచ్చలేదని చెబుతుంది. రోహిణిని బిగ్ బాస్ హౌస్ కు ఇలాంటి క్యాండిడేట్స్ వేస్ట్ అని చెబుతుంది తమన్నా. రవికృష్ణ మబ్బులా ఉండిపోవటం చూడలేకపోయానని నువ్వు బయట హీరో బిగ్ బాస్ హౌస్ నుండి కూడా హీరోగా రావాలని కోరుకుంటున్నాని చెబుతుంది తమన్నా. రాహుల్ సిప్లిగంజ్ కు ఆడపిల్లలకు గౌరవం ఇచ్చి మాట్లాడాలని సూచిస్తుంది తమన్నా. 
 
పునర్నవి ఇతరుల మాటలు విని తప్పుదోవ పడుతుందని చెబుతుంది తమన్నా. మహేశ్ విట్టాని తమ్ముడని చెబుతుంది తమన్నా. వితిక ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతుందని రాహుల్ మాటలు విని తప్పుదోవలోకి వెళుతుందని తమన్నా చెబుతుంది. బాబా భాస్కర్ తన తల్లి, తండ్రి, గురువులాంటి వాడని చెబుతుంది తమన్నా. అలీ రేజా గురించి బిగ్ బాస్ ఇంట్లో విలన్ అయిపోతున్నాడని, ఆడవాళ్ళను టార్గెట్ చేయొద్దని మగవాళ్ళను టార్గెట్ చేసి మగాడని నిరూపించుకోవాలని తమన్నా చెబుతుంది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: