యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సీరీస్ త‌ర్వాత సుజిత్ ద‌ర్వ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్క‌బోతున్న సినిమా `సాహో`. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆగ‌స్టు 30న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాపై నెటిజ‌న్లు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ట్రోల్ చేస్తూనే వ‌చ్చారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. ఏదైనా సినిమా  ట్రైలర్ లేదా పోస్టర్ గానీ రిలీజ్ అయితే వెంట‌నే నెటిజన్లు కాపీనా లేదా ఓన్‌నా తెలుసుకుని ట్రోల్ చేయ‌డం ప్రారంభించేస్తున్నారు.


అయితే ఈ క్ర‌మంలోనే సాహో చిత్ర యూనిట్  సినిమాలో ప్ర‌భాస్‌ ఫ‌స్ట్ ల‌క్ విడుద‌ల చేసింది. వెంట‌నే నెటిజ‌న్లు ఇది హాలీవుడ్ సినిమా కాఫీ అని ట్రోల్ చేశారు. మ‌రియు తాజాగా విడుద‌ల అయిన సాహో పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ మ‌రియు శ్రద్ధా కూడా క‌నిపిస్తారు. దీన్ని కూడా కాపీ అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు సాహోపై కాపీ మ‌ర‌క‌లు ప‌డుతూనే ఉంది. ఎంత జాగ్ర‌త్త‌గా వ‌చ్చిన నెటిజ‌న్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ఇక తాజాగా భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో శనివారం ‘సాహో’ ట్రైలర్ విడుద‌ల అయింది.


ఈ క్ర‌మంలోనే అందులోని ఒక డైలాగ్ 'గల్లీ సిక్స్ ఎవడైనా కొడతాడు...కానీ స్టేడియం లో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంద‌ని ప్ర‌భాస్ చెబుతాడు. నిజానికి ఈ డైలాగ్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. అయితే నెటిజ‌న్లు మాత్రం ఈ డైలాగ్  త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేష‌న్లో వ‌చ్చిన జులాయి సినిమాలో డైలాగ్ మాదిరిగా ఉందిని ట్రోల్ చేస్తున్నారు. సుజిత్ స‌హ‌జంగానే డైలాగ్ రాసుకొని ఉంటాడు. కానీ అది జులాయి సినిమాకు ద‌గ్గ‌ర పోలిక‌లు ఉండ‌డంతో నెటిజ‌న్లు కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి పోస్ట‌ర్ విష‌యంలో దీమాగా స్పందించిన‌ సుజిత్ ఈ విష‌యంలో ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: