సంపూర్ణేష్‌బాబు హృద‌య‌కాలేయం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించి త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత రెండు మూడు సినిమాలు వ‌చ్చినా పెద్ద‌గా ఆక‌ట్టులేక‌పోయాయి. అయితే తాజాగా విడుద‌ల అయిన `కొబ్బ‌రిమ‌ట్ట‌` సినిమాతో మ‌ళ్లీ తిరిగి ఫుల్ జోష్ ప‌ట్టాలెక్కాడు. ‘కొబ్బరిమట్ట’ సినిమాలో సంపూ మూడు రోల్స్‌లో క‌నిపిస్తాడు. ఈ క్ర‌మంలోనే మాష్ హీరోగా భారీ డైలాగులు చెబుతూ అంద‌రిని అల‌రిస్తూ న‌వ్విస్తాడు. ఈ సినిమా ఆగ‌ష్టు 10 రిలీజ్ అయింది. 


రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో సంపూ ఎంతో హాస్యాన్ని పండిస్తాడు.  మూడు పాత్ర‌ల‌తోనూ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. అలాగే ఇందులో సంపూ డైలాగ్స్ ఆక‌ర్ష‌ణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాను మదనపల్లెలో విడుదల చేయలేదంటూ అక్క‌డ‌ ఓ అభిమాని సెల్ టవర్ ఎక్కాడు. 


మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో ఈ ఘ‌న‌ట చోటుచేసుకుంది. బాబుకాలనీకి చెందిన రెడ్డెప్ప అనే యువ‌కుడు అప్ప‌టికే ప్రెస్ మీట్ పెట్టి మ‌ద‌న‌ప‌ల్లెలో ప్ర‌పంచ వ్యాప్తండి విడుద‌ల అయిన ఈ సినిమాను మ‌ద‌న‌ప‌ల్లిలో కూడా విడుద‌ల చేయ‌మ‌ని కోరారు. అయితే దీనికి ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డంతో ఆదివారం మ‌ధ్య‌హ్నాం సెల్ ట‌వ‌ర్ ఎక్కి హ‌ల్‌చ‌ల్ చేశాడు.ఈ క్ర‌మంలోనే విష‌యం తెలుసుకుని అక్క‌డ‌కు చేరుకున్న టూటౌన్ పోలీస్ సిబ్బంది అత‌నికి న‌చ్చ‌చెప్పినా రెడ్డ‌ప్ప విన‌లేదు. 


నీకు న్యాయం చేస్తామ‌ని చెప్పినా సాయంత్రం ఆరు గంట‌ల‌కు వ‌ర‌కు అక్క‌డే ఉండి అంద‌రిని భ‌య‌పెట్టాడు. చాలా మంది అక్కడ గుమికూడ‌డంతో  మ‌రింత హ‌ల్‌చ‌ల్ చేసి రెచ్చిపోయాడు. కొంత సేప‌టికి త‌న త‌మ్ముడు ప్రశాంత్ సెల్ ట‌వ‌ర్ ఎక్కి రెడ్డెప్ప‌కు న‌చ్చ‌చెప్పి అర‌గంట త‌ర్వాత కింద‌కు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత అత‌నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: