టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘హృదయకాలేయం’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియలో పెద్ద సంచలనం రేపాడు. ఇక హృదయకాలేయం సినిమా రిలీజ్ తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గా పాపులారిటీ సంపాదించాడు.  సింగం 123 సినిమాలో హీరోగా నటించిన సంపూర్ణేష్ బాబు ఆ సినిమా భారీ డిజాస్టర్ తో క్యారెక్టర్ పాత్రలపై దృష్టి పెట్టారు.  ఇలా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు సంపూర్ణేష్ బాబు. 

వెండితెరపై సంపూ కనిపిస్తే చాలు ఆటోమెటిక్ గా నవ్వుల జల్లు కురుస్తుంది.  సంపూర్ణేష్‌బాబు, ఇషికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఈ సినిమాలో త్రిపాత్రాభినయంతో సంపూ ఇరగదీశాడని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.  రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కొబ్బరిమట్ట’లో సంపూర్ణేష్ కామెడీ డైలాగ్స్ థియేటర్లో ఆడియన్స్ నవ్వులు పూయించేలా చేశాయి.

అంతే కాదు 3 నిమిషాల పాటు సంపూర్ణేష్ బాబు కొట్టే డైలాగ్ సినిమాకు హైలెట్ అయ్యింది.  నిర్మాత సాయి రాజేశ్‌ నీలం నిర్మించారు.  తాజాగా ఈ సినిమాని  ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రిలీజ్ చేయలేదని సంపూ హార్డ్ కోర్ అభిమాని ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన చేశాడు.  శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని దర్శకుడు రూపక్‌ రొనాల్డ్‌సన్‌, నిర్మాత సాయి రాజేశ్‌ నీలంలను డిమాండ్ చేశాడు. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పందన చూపించకపోవడంతో మనస్థాపానికి గురైన సంపూ అభిమాని మధ్యాహ్నం 3 గంటలకు రెడ్డప్ప స్థానిక అయోధ్యనగర్ లోని సెల్ టవర్ ఎక్కేశాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  అయితే రెడ్డప్పకు పోలీసులు ఎంతో నచ్చజెప్పారు..అయితే ఎంతో మంది హీరోల సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తారు..కానీ సంపూ సినిమాను మాత్రం రిలీజ్ చేయలేదు..ఎందుకు అని ప్రశ్నించారు.  ఎలాగో అలా నచ్చజెప్పి రెడ్డప్పను కిందకు దించారు. తర్వాత రెడ్డెప్పను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెడ్డెప్ప మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: