పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పూరికి పలువురి హీరోల నుంచి అభినందనలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు మెచ్చుకోవటంతో ఇక పూరి బ్యాక్ అనే స్థితికి వచ్చేశారు. దీనితో పూరి తరువాత సినిమా ఎవరితో ఉంటుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అప్పట్లో తరువాత మూవీ విజయ దేవర కొండతో ఉంటుందని వార్తలు వచ్చినా అవేమి నిజాలు కాదని అప్పుడు దేవరకొండ వర్గం ఆరోపించారు. అయితే ఇప్పుడు అధికారికంగా పూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు ట్విట్టర్లో పూరి చెప్పుకొచ్చారు. 


పూరి  విజయ్ కాంబినేషన్ లో సినిమాకు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే కోన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇష్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనం చూశాము. ఇంకా తనలో ఆ ఫైర్ ఉందని మణిశర్మ నిరూపించారు. దీనితో మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ నే ననీ ఫిక్స్ అయిపోవచ్చు. ఈ విషయంలో విజయ దేవరకొండ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 


ఇక హీరోయిన్ గా రష్మిక నే మళ్ళీ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. విజయ్ అయితే రష్మిక అయితే బాగుంటుందని స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీనితో మళ్ళీ రష్మిక నే కొనసాగవచ్చు. అయితే విజయ దేవకొండ నటిస్తున్న సినిమా 'హీరో' ఇక ఆగిపోయినట్టేనని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ మళ్ళీ సినిమా మొదలవుతుందని చెబుతున్న అదేమీ లేదని విజయ్ వర్గాలు చెబుతున్నారు. ఇక పూరి ప్రతి సినిమాలో హీరోకి ఒక్కొక్క గెట్ అప్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ కు కూడా సరికొత్త గెట్ అప్ తయారు చేసే పనిలో పడ్డారు పూరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: