అటు టాలీవుడ్ లోనూ,కొలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రెజీనా. ఎస్ ఎమ్ ఎస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ప్రస్తుతం అడవి శేష్ నటించిన "ఎవరు" చిత్రంలో నటిస్తుంది. పీవీపీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


దీంతో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న రెజీనా మీడియాతో మాట్లాడింది. "ఎవరు" సినిమా స్క్రిప్టు గురించి పీవీపీ సార్ ముందే చెప్పారు. కథ నచ్చితే చేద్దాం అన్నారు. ఆ తర్వాత అడవి శేష్, పీవీపీ ఇద్దరూ కలిసి చెన్నై వచ్చి కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. దీనిలో సమీర పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం నేనే కనిపిస్తాను. ఈ విషయం నిర్మాత నాకు ముందే చెప్పారు.


ఎంతో కష్టపడి ఓ స్థాయికి వచ్చిన యువతి సమీర . సడెన్ గా  ఆమె జీవితంలో ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన ద్వారా ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. అదేంటనేదే కథ. సినిమా నచ్చితే  ఆ పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ. "అ!" సినిమాలో న పాత్ర నిడివి చాలా తక్కువ. అయినా కూడా ఆ పాత్ర కోసం నా జుట్టు కత్తిరించుకున్నాను. ఆ సినిమాలో నా మేకప్  గురించి చాలా మంది చర్చించుకున్నారు.


ఇప్పుడు "అ!" సినిమాకి మేకప్ లో జాతీయ అవార్డు రావడం ఆనందం కలిగించే విషయం.ఇక ఎవరు సినిమా సెట్ లో అడివి శేష్‌ సెట్‌లో నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు . నా ఫుడ్‌ తినేసేవాడు. నేను తినడానికి ఫలానా ఐటమ్‌ తీసుకురమ్మని నా అసిస్టెంట్‌కు చెప్పినప్పుడు శేష్‌ పక్కన కూర్చుని చూస్తుంటాడు. మీకు కూడా కావాలా? సర్‌ అని అతడు అడిగేవాడు. శేష్‌ సెట్‌లో నన్ను ఇరిటేట్‌ చేస్తూనే ఉన్నాడు. మా మధ్య ఫన్నీ రిలేషన్‌ షిప్‌ ఉంది. అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: