ఇటీవల ఆమె సినిమాలో నగ్నంగా నటించి వివాదల్లోకి ఎక్కిన కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతుంది. అందులో భాగంగా  ఇటీవల యువ హీరో  ఆదిత్ అరుణ్ తో స్ట్రెయిట్ తెలుగు సినిమా కు ఓకే చెప్పింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిన్న అధికారికంగా లాంచ్ అయ్యింది. ఓ నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.  ఇక ఈ సినిమా తోపాటు   తెలుగు సూపర్ హిట్ మూవీ జెర్సీ తమిళ రీమేక్ లో నటించాడని ఓకే చెప్పిందట అమలా పాల్.  కాగా ఈ సినిమాలో ఆమె ఒరిజినల్ వెర్షన్ లో శ్రద్ద శ్రీనాథ్ పోషించిన పాత్రలో కనిపించనుంది.  ఇక ఈ రీమేక్ లో  హీరోగా  విష్ణు విశాల్ నటించనున్నాడు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. కాగా అమలా పాల్ , విష్ణు విశాల్ ఇంతకుముందు తమిళంలో రాక్షసన్ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.మరి ఈ జెర్సీ రీమేక్ తో కూడా వాళిద్దరూ మళ్ళీ హిట్ పెయిర్ అనిపించుకుంటారో లేదో చూడాలి. 


ఇక ఇదిలా ఉంటే  క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా గా  తెరకెక్కిన  జెర్సీ విమర్శకుల ప్రశంసలు పొందింది. నాచురల్ స్టార్  నాని  నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి  డైరెక్ట్ చేయగా అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఇక ఈ జెర్సీ ని ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు  ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ రీమేక్ కు క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: