అంతర్జాలిక లపై నిత్యామేనన్ గుస్సా

 అంతర్జాలం లో తను విమర్శించే వారి పై  సినీనటి నిత్య మేనన్ మండి పడింది. వర్షాలు, వరదలు  తో స్వంత రాష్ట్రం కేరళ అతలా కుతలం అవుతుంటే నిత్య మేనన్ మాత్రం వివిధ సినీ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందిస్తూ  హోయలు పోతోందని కొందరు కేరళ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.  


 దీని పై నిత్య మేనన్  స్పందిస్తూ కొందరు పని పాట లేని తెలివి తక్కువ వారు చేసే ఈ రకమైన వ్యాఖ్యలపై మాట్లాడి సమయం వృధా చేసుకొని అవసరం లేదని  ఈ కేరళ కుట్టి చెప్పింది. ఈ రకమైన వ్యాఖ్యలు చేసే వారు ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలని. కేరళ లో పరిస్థితి ఎప్పటి కప్పుడు తెలుసు కుంటూ  ఉన్నానని తప్పని సరిగా సహాయక చర్యల లో తన వంతు చేయూత అందిస్తానని తెలిపింది.


అవును సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పు పట్టడం సరికాదని మలయాళ భామ చెప్పింది.   ప్రచార కార్యక్రమాలు కూడా సినిమాలు ఒక భాగమని, అందులో పాల్గొనడం నటీ నటుల బాధ్యత అని తెలియ జేసింది.   ఈ ప్రచార కార్యక్రమాలకు అదనంగా పారితోషికం చెల్లించడం జరగదన్నది.

 ఈ ముద్దు గుమ్మ అక్షయ్ కుమార్ కలిసి మిషన్ మంగళ్ నటించి న విషయం విధితమే.   వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడు దల కానున్న ఈ చిత్రం లో తాప్సి విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు                                       



మరింత సమాచారం తెలుసుకోండి: