ప్రకృతి విపత్తులలో ఎక్కువ నష్టం కలిగించేవి వరదలు. వరదల వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడం కూడా కష్టమే.తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక వారు పడే బాధలు వర్ణనాతీతం. వరదల వల్ల నష్టపోయిన దాన్ని అంత తొందరగా రికవరీ చేయలేం. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు వర్షాలతో జలమయం అయ్యాయి. తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. 


అయితే వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేయడానికి  తమ వంతు బాధ్యతగా మానవత్వంతో ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ అంశం. ఇటువంటి సమయాల్లో  చాలా మంది సినీతారలు వరద బాధితులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. అయితే ఒకప్పుడు తెలుగులో వెలుగు వెలిగి, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళాడి ముంబయిలో సెటిల్ అయిన జెనీలియా తన దాతృత్వాన్ని చాటుకుంది. జెనీలియా దంపతులు వరద బాధితుల సహాయార్థం ఇరవై ఐదు లక్షలు విరాళం అందించారు.


సోమవారం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్‌ ట్విటర్‌ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. దీనికి రితేష్‌ ప్రతిస్పందించారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నా మనసును, జెనీలియా మనసును చలింపజేశాయి.


సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని కలసి ‘దేశ్‌ ఫౌండేషన్‌’ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే వాళ్ళ బాధని కొంతైనా తగ్గించవచ్చు. థాంక్స్‌ దేవేంద్ర ఫడణవీస్‌ జీ’ అని ఆయన ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: