సౌత్ ఇండియాలో టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు నిత్యా మీనన్.  వరసగా సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. గ్లామర్ షో కు దూరంగా ఉంటుంది.  కథ, కథనాలు నచ్చితేనే సినిమా చేస్తుంది.  తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి.  అప్పుడే సినిమా చేసేందుకు ఒకే చెప్తుంది.  ఇలా ఎన్నో సినిమాలను దూరం చేసుకుంది.  సౌత్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.  అలా ప్రాముఖ్యత లేని సినిమాల్లో ఆమె నటించదు. 


అయితే, ఇప్పుడు ఈ హీరోయిన్ మిషన్ మంగళ్ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సందర్భంగా నిత్యా మీనన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నది.  ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  రెడ్ కలర్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.  ఈ కామెంట్లపై నిత్యా మీనన్ స్పందించింది.  



కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే.. ఇలా ఫోటోలు దిగడం ఏమన్నా భావ్యంగా ఉన్నదా అని ఫైర్ అవుతున్నారు.  దీనిపై నిత్యా మీనన్ స్పందించింది.  రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.  ఆ విషయం నాకు తెలుసు....రాష్ట్రం విషయంలో మేము ఏమి చేయడం లేదని అంటున్నారు.  కానీ, మేము ఏం చేస్తున్నాం అనే విషయం అందరికి చెప్పాల్సిన అవసరం లేదు.  



వరద బాధితులను ఆదుకోవడానికి మేము కొన్ని పనులు చేయాలని అనుకుంటున్నాం.  ఆ పనులు ఏంటి అన్నది చెప్పాల్సిన అవసరం లేదు.  రాష్ట్రం పట్ల మాకు బాధ్యత ఉన్నది.  చేయాల్సిన పనులను తప్పకుండా చేస్తాం.. ఒక సినిమా ఒప్పుకున్నాక.. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది.. అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నిత్యా మీనన్.  నిత్యా ఇచ్చిన ఈ వార్నింగ్ కు నెటిజన్లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: