సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరునికెవ్వరు'. ఇటీవలే ఈ చిత్రం కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకు సంబందించి ఎప్పటికి కప్పుడు అప్డేట్స్ ఇస్తూ ముందుగానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసాడు అనిల్. అందులో భాగంగా నిన్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి షూటింగ్ లో జాయిన్ అయ్యిందని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఆమె లుక్ ను కూడా పోస్ట్ చేశాడు.
కాగా సుమారు 13 సంవత్సరాల తరువాత మళ్ళీ విజయశాంతి సెట్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ చిత్రంలో విజయశాంతి కాలేజ్ ప్రొఫెసర్ గా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె లుక్ కూడా అందుకు తగ్గట్లుగా ఉండడం ఈవార్తలకు బలాన్ని చేకూర్చుతుంది. ఈసినిమాలో ఆమె పాత్ర కీలకం కానుంది. పక్క కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.
ఇక భరత్ అనే నేను , మహర్షి సినిమాలతో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్.. ఈ సంక్రాంతి కి ఎఫ్ 2 తో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఈ సరిలేరు నీకెవ్వరు తెరకెక్కుతుండడంతో సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.