మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో కంప్లీట్ చేశారు.  ఈ షెడ్యూల్లో మహేష్ మేజర్ పాత్రకు సంబంధించిన సీన్స్, మహేష్ ఇంట్రో సీన్స్ షూట్ చేశారు.  అక్కడి నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాక సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.  గత నెల 26 నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  


అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైన్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.  ఇందులో లాంగ్ టైమ్ కామెడీ సీన్స్ షూట్ జరుగుతున్నది.  దీంతో పాటు రామోజీఫిల్మ్ సిటీలో కర్నూలు కొండారెడ్డి బురుజు కు సంబంధించిన సెట్ వేశారు.  ఆ సెట్ లో కర్నూలు బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్న సన్నివేశాలు సెకండ్ హాఫ్ కు సంబంధించిన సన్నివేశాలని తెలుస్తోంది.  



ఈరోజు  నుంచి విజయశాంతి కూడా సెట్ లో జాయిన్ అయ్యింది.  విజయశాంతి ఇందులో  కీలక రోల్ ప్లే చేస్తున్నది.  రష్మిక మందన్న హీరోయిన్.  కాశ్మీర్ కు, హైదరాబాద్ కు కర్నూలు కు లింక్ ఏంటి అన్నది సినిమాలో చూడాల్సిందేనట.  మేజర్ గా ఉన్న మహేష్ సడెన్ గా హైదరాబాద్ కు ఎందుకు రావాల్సి వచ్చింది.  వచ్చిన తరువాత కర్నూలు ఎందుకు వెళ్ళాడు అన్నది కథ.  



చూస్తుంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కథను తెరకెక్కిస్తున్నారు అన్నది అర్ధం అవుతున్నది.  నవంబర్ వరకు షూటింగ్ ను కంప్లీట్ చేయాలని యూనిట్ కంకణం కట్టుకుంది.  నవంబర్ నవంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి.. డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ చేయాలనీ యూనిట్ భావిస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు నిర్మిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: