దాదాపు 13 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది లేడీ అమితాబ్ విజయశాంతి. మొన్నటి వరకు రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో విజయశాంతి పాల్గొన్న ఒక ఫోటో ని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో విడుదల చేసి విజయశాంతి గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మొహం లో ఎటువంటి మార్పు రాలేదు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.


ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో విజయశాంతి ఎటువంటి పాత్రలో నటిస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఈ సినిమాలో మహేష్ కి అత్తగా విజయశాంతి నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విజయశాంతి కొట్టిపారేశారు. అంతేకాకుండా మహేష్‌కు అత్తగా న‌టించ‌డం లేద‌నీ, అస‌లు త‌మ పాత్రల‌ మధ్య ఎటువంటి రిలేషన్ ఉండ‌దనీ, ఇద్దరి పాత్రలు స‌మాంత‌రంగా సాగే పాతల‌ని చెప్పుకొచ్చారు. మొత్తంమీద సినిమాలో తనది పాజిటివ్ రోల్‌ అని, నెగటివ్ క్యారెక్ట‌ర్స్‌కు తను దూరమని చెప్పారు లేడీ అమితాబ్‌.


దాంతో ఆమె చేస్తున్న క్యారక్టర్ ఏమిటనే క్యూరియాసిటీ మరింతగా పెరిగిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ శాంతి ప్రొపెసర్ గా కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ లా కాలేజీలో ఈ మేరకు సీన్స్ ఆమె పై షూట్ చేస్తున్నారు. గ్రే హెయిర్, కళ్లకు అద్దాలతో అచ్చమైన ప్రొఫెసర్ గా ఉన్నారు.  ఈ సినిమాని రానున్న సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: