ఎప్పుడూ లేని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ప్రతీసారి కొత్తదనంతో, అటు కంటెస్తెంట్స్ కి ఇటు ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతున్నాడు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ కొంత ఇబ్బంది పడ్డారు.ఎప్పుడూ సౌమ్యంగా , ఎవ్వరితో గొడవలు పెట్టుకోకుండా కనబడే బాబా భాస్కర్ ని ఈ నామినేషన్ ప్రక్రియ కొంత అసౌకర్యానికి గురి చేసింది.


హౌస్ మేట్స్ లో ఇద్దరిద్దరినీ కన్ఫెషన్ రూంకి పిలిచి వాళ్ళలో వాళ్ళనే ఎవరు నామినేట్ అవ్వాలో డిసైడ్ చేసుకోమన్నాడు. బాబా భాస్కర్,ఆషు ఇద్దరిలో బాబా భాస్కర్ తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పటికీ ఆషు రెడ్డి చెప్పిన కారణంతో కొద్దిగా నొచ్చుకున్నాడు. అప్పటీకే లివింగ్ రూంలో జరిగిన వాదనతో ఎంతో కొంత డిస్టర్బ్ గా ఉన్న బాబా భాస్కర్ ఆషు చెప్పిన కారణానికి నొచ్చుకున్నారు. ఆ తర్వాత కిచెన్ లో వంట చేస్తున్నపుడు హిమజ అడిగిన దానికి మరింత డీలా పడ్డారు.


మద్యాహ్నం వండిన కరీ తింటారో లేదో వేడి వేడిగా ఉంటే బాగుంటుంది. మిగతా వాళ్ళని  ఒకసారి అడిగి రావాలా? అని హిమజ అనడంతో కరీ చేస్తున్న బాబా భాస్కర్ అడగాల్సిన అవసరం ఏముందని కొంత సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత హిమజ వెళ్ళిపోయాక శ్రీముఖితో ఈ విషయం డిస్కస్ చేసాడు. కష్టపడి చేస్తున్నదంతా వేస్ట్ చేస్తారా? పాతదో, కొత్తదో ఏదైతే ఏమవుతుంది. తినడానికే కదా అంటూ ఎమోషనల్ అయ్యాడు.


అయితే కన్ఫెషన్ రూం నుండు వచ్చినప్పటినుండి మనసు బాలేదని, మూడ్ డిస్టర్బింగ్ గా ఉందని చెప్పాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే బాబా భాస్కర్ ఇలా ఎమోషనల్ కావడం మొదటిసారి. మరి ముందు ముందు బాబా భాస్కర్ ప్రవర్తన హౌస్ మేట్స్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: