బిగ్ బాస్ లో నామినేషన్ ప్రక్రియ ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నపుడు కంటెస్టెంట్స్ ఎవ్వరూ ఎవరితో మాట్లాడకూడదనే నియమం ఉంది. ఇది వరకు ఈ విషయమై బిగ్ బాస్ రెండు మూడు సార్లు హెచ్చరించారు కూడా. అయినా కొందరు కంటెస్టెంట్స్ ఈ మాటలని పెడచెవిన పెడుతున్నారు. ఇంటి నియమాలని పాటించకపోతే ఎలాంటి శిక్ష వేస్తారో తెలిసాక కూడా మళ్ళీ తప్పు చేయడం కరెక్ట్ కాదు. 


అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో శివ జ్యోతి, రోహిణిలు కన్ఫెషన్ రూం నుండి బయటకు వచ్చాక వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పెట్టుకున్నారు. అంతే కాకుండా పక్కనున్న వితికాతో కూడా మాట్లాడారు. ఇది గమనించిన బిగ్ బాస్ శివ జ్యోతి, రోహిణిలకు పనిష్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ నామినేట్ అయిన శివజ్యోతి తో పాటు రోహిణిని కూడా నామినేట్ చేసాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వారమే కాదు,వచ్చే వారం కూడా వాళ్ళిద్దరు నామినేషన్ లో ఉండబోతున్నారు.


నామినేషన్ ప్రకియని సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ ఈ ఇద్దరికీ పెద్ద శిక్షే వేసాడు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. శివజ్యోతి, రోహిణి లు గుసగుసలు పెట్టుకున్నారు. అలాగే వితికాతో కూడా శివజ్యోతి గుసగుసలు పెట్టింది. మరి వితికాని ఎందుకు నామినేట్ చేయలేదనే ప్రశ్న మొదలైంది. తప్పు చేసింది ముగ్గురు కాబట్టి ముగ్గురిని శిక్షించాలని వాదిస్తున్నారు. వితికా విషయంలో బిగ్ బాస్ చేసింది కరెక్ట్ కాదని భావిస్తున్నారు.


గతంలో నామినేషన్ సమయంలో మాట్లాడిన వితికా, వరుణ్ లని హెచ్చరించిన బిగ్ బాస్, ఈ వారం వితికాని వదిలి మిగతా వారికి పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాడో తెలియట్లేదు. శివజ్యోతి చేసింది తప్పు అయినపుడు వితికా చేసింది తప్పు కాదా అని వాదిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ విషయాన్ని బిగ్ బాస్ తెలుసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: