రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై  వోల్టేజ్ యాక్టన్ ఎంటర్టైనర్ సాహో విడుదల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. అన్ని భాషల్లో కలిపి 50మిలీయన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. 


ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో  ఏకంగా బాహుబలి2 నే క్రాస్ చేసిందని సమాచారం. నైజాం లో సినిమాను సొంతంగా నిర్మాతలే విడుదలచేస్తున్నారు దాని వాల్యూ 40కోట్ల వరకు వుంటుందట. కాగా సీడెడ్ హక్కులు 25కోట్లకు అమ్ముడైయ్యాయి. తూర్పు &పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి  ఈసినిమా రైట్స్ 19కోట్ల ధర పలుకగా వాటితో కలిపి   కోస్టల్ ఆంధ్రా లో ఈసినిమా   60కోట్ల బిజినెస్ చేసిందట. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం  125కోట్ల  బిజినెస్ చేసిందని సమాచారం. ఇంతకుముందు బాహుబలి 2 తెలంగాణ ,ఏపీ లో కలిపి 122కోట్ల బిజినెస్ చేసింది. 


ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి సాహో  400కోట్లవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం వుంది. ఈలెక్కన ఈచిత్రం మొదటి రోజే 70కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి.   'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో  బాలీవుడ్  బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా  జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరా భేడి  తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఆగస్టు30న  ప్రపంచ వ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలకానుంది. కాగా ఈ సినిమాను హిందీలో టీ సిరీస్ విడుదల చేస్తుండగా ఓవర్సీస్ హక్కులను  పార్ ఫిలిమ్స్ దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: