రెజీనా అందగత్తె. నటనాపరంగా  కూడా మంచి మార్కులు కొట్టేసే ఆ అమ్మాయికి అవకాశాలు మాత్రం తక్కువగా వస్తున్నాయి. తెలుగులో యూత్ హీరోల పక్కన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రమంలోనే  కొన్ని ఫ్లాప్స్ ఆమెని బాగా వెన‌క్కు నెట్టేశాయి. దాంతో రెజీనా కొంతకాలంగా టాలీవుడ్ కి దూరమైంది. కోలీవుడ్లో తన హవా చూపిస్తున్నా తెలుగులో మాత్రం ఆమెకు ఇపుడు ఒకే ఒక ఆశ ఉంది.


అదే ఎవరు మూవీ. అడవి శేషు హీరోగా రెజీనా, నవీన్ చంద్ర నటిస్తున్న ఈ మూవీలో తన పాత్ర గురించి చెబుతూ మంచి చాన్స్ ఇది అంటోంది రెజీనా. ఈ అవకాశం దక్కడం ఓ లక్ అని కూడా మురిసిపోతోంది. ఈ నెల 15న వస్తున్న ఈ మూవీలో 80 శాతం తన మీదే సినిమా రన్ అవుతుందని కూడా రెజీనా చెబుతోంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని తాను అనుకుంటున్నట్లుగా కూడా అమె చెబుతోంది. అయితే ఈ మూవీ తనకు పెద్ద అనుభవం అని కూడా అంటోంది.


ఈ మూవీలో హీరో అడవి శేష్ తనని ఓ విధంగా టార్చర్ పెట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ఆన్ స్ర్కీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా అడవిశేషు తనని బాగా వేధించాడు అంటోంది అయితే వేరే విధంగా కాదని, పాత్ర బాగా రావాలని మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.  ఈ వేధింపులు ఫన్ గా ఆమె అంటూ అలా హ్యాపీ మూడ్ లోనే సినిమా షూటింగ్ ముగిసిందని రెజీనా చెబుతోంది.


ఈ మూవీలో తన పాత్ర బాగుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని ఆమె అంటోంది. తనకు పాత్ర ముఖ్యమని, ఇక హిట్లు, ఫట్లు ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందేనని రెజీనా చెబుతోంది. తన వరకూ పాత్ర బాగుంటే హిట్ అనుకుంటానని అంటోంది. మొత్తానికి రెజీనాలో కొత్త ఆనందం కనబడుతోంది. ఎవరు మూవీ హిట్ అయితే తెలుగులో మళ్ళీ రెజీనా రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: