అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో అతని నటనకి మంచి అప్లాజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ రేంజే మారిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి విజయాన్ని అందించింది. దాంతో విజయ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. అపుడు బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా విజయ్ తో సినిమా తీయడానికి రెడీ అయింది.
దాంతో "డియర్ కామ్రేడ్ మూవీ పట్టలెక్కింది. యాష్ రంగినేని ఒక్కడే నిర్మించాల్సిన డియర్ కామ్రేడ్ను తన చేతుల్లోకి తీసుకుని.. దాన్ని పెద్ద స్కేల్లో తీసిన మైత్రీ సంస్థ.. ఈ సినిమాకు మంచి బిజినెస్ జరగడంతో ఉత్సాహంగా విజయ్ తర్వాతి సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చింది.ఆనంద్ అన్నామలై అనే కొత్త దర్శకుడితో హీరో అనే చిత్రాన్ని భారీ బడ్జెట్లో తీయడానికి సన్నాహాలు చేసింది.
రెండు నెలల కిందటే ఆ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులు షూటింగ్ చేశారు కూడా. కానీ అయినంత వరకు రషెస్ చూస్తే సంతృప్తికరంగా లేదని.. దీనికి బ్రేక్ వేశారు. స్క్రిప్టు మీద మళ్లీ పని చేసి.. కొంత విరామం తర్వాత సినిమా పునఃప్రారంభించాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం హీరో సినిమాను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారట.
డియర్ కామ్రేడ్ దెబ్బకు విజయ్ మార్కెట్ దెబ్బ తింది. తాము అనుకున్న బడ్జెట్లో హీరోను పూర్తి చేసి మార్కెట్ చేసుకోవడం కష్టమని మైత్రీ సంస్థ భావిస్తోందట. దర్శకుడి పనితనం మీద కూడా సందేహాలు రేకెత్తడంతో సినిమా తేడా కొడితే నిండా మునుగుతామని భావించి.. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు పోయినా పర్వాలేదని సినిమాను పక్కన పెట్టేసినట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం
.