ట్యాలెంటెడ్  హీరో శర్వానంద్, 'స్వామి రారా' పేమ్  సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రణరంగం. ఈచిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా  ఆగస్టు 15న విడుదలకానుంది.  కాగా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్న ఈ సినిమా కు పెద్దగా బజ్ మాత్రం క్రియేట్ కావడంలేదు.  అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కు మాత్రం  మంచి స్పందనే వచ్చింది.


ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సుధీర్ వర్మ మాట్లాడుతూ... ఈసినిమా ను ముందుగా మాస్ రాజా రవితేజ తో తీద్దామనుకున్నాం కానీ ఆయన అప్పుడు వరుస సినిమాలతో  బిజీ గా ఉండడంతో కుదరలేదని అన్నాడు. అలాగే  ఈ సినిమా విజయం సాదిస్తుందని ఆయన  ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా గా రానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ,  'హలో' బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించగా  సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించింది. ప్రశాంత్ పిళ్ళై  సంగీతం అందించాడు. కాగా  ఈ చిత్రంలో శర్వా డిఫ్రెంట్ షేడ్స్ వున్న పాత్రల్లో కనిపించనున్నాడు.  అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి మిడిల్ ఏజ్డ్ పాత్రా అని సమాచారం.  


ఇక గత  ఏడాది పడి పడి లేచె మనసు చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన  శర్వా కు ఆ సినిమా రిజల్ట్ గట్టి షాక్ ఇచ్చింది. దాంతో ఈ రణరంగం  విజయం సాధించడం ఆయనకు కీలకం కానుంది.  ప్రస్తుతం శర్వానంద్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో  సమంత హీరోయిన్ గా  నటిస్తుంది. ఈసినిమాతో పాటు శర్వా మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేశాడని సమాచారం. త్వరలోనే ఆ సినిమాల వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: