ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా యంగ్ డైరెక్టర్ సుజిత్ అదృష్టానికి సంబంధించిన వార్తలే. దర్శకుడుగా రెండవ సినిమాతోనే ప్రభాస్ లాంటి టాప్ హీరోను డైరెక్ట్ చేయడం ఒక అదృష్టం అనుకుంటే ఆ మూవీ బడ్జెట్ 300 కోట్ల ఫిగర్ కు దరిదాపు చేరిపోవడంతో ఇప్పుడు ‘సాహో’ ఏమేరకు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న విషయం పై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడు ఈ విషయాలు అన్నీ సుజిత్ దృష్టి వరకు వెళ్ళడంతో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజిత్ వ్యూహాత్మకంగా స్పందించాడు. ‘సాహో’ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అయినా ఈ మూవీని ‘బాహుబలి’ స్థాయిలో ఉంటుందని అంచనాలు పెట్టుకోవద్దు అంటూ ప్రభాస్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. 

‘బాహుబలి’ ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ ధియేటర్లకు రావద్దని చెపుతూ ఈమూవీని డిఫరెంట్ గా చూడామని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒక తెలుగు దర్శకుడు ఒక తెలుగు హీరో కలిసి హాలీవుడ్ ‘ఎవెంజర్స్’ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్’ లాంటి భారీ సినిమాలను తీసి సక్సస్ అందుకోగలరు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి తాను ‘సాహో’ మూవీని తీసాను అని అంటున్నాడు. 

ఇక మీడియాలో కొంతమంది తనను రాజమౌళితో పోలుస్తూ చేస్తున్న కామెంట్స్ ను చూస్తుంటే తనకు భయం వేస్తోందని రాజమౌళి స్థాయికి తాను ఏ విధంగాను సరిపోను అంటూ కామెంట్స్ చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ మూవీ ఫలితం గురించి తనకంటే తన తల్లి విపరీతంగా టెన్షన్ పడుతున్న విషయాన్ని వివరిస్తూ ‘సాహో’ అంచనాలు చేరుకోలేకపోతే తన పరిస్థితి ఏమైపోతుందో అంటూ భయపడుతూ తన తల్లి అన్ని దేవుళ్ళకు రకరకాల మొక్కులు మొక్కుకుంటున్న విషయాలను వివరించాడు. ఒకవైపు ‘సాహో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ మరొక వైపు సుజుత్ ప్రభాస్ అభిమానులకు చేస్తున్న విజ్ఞప్తులు చూస్తుంటే ‘సాహో’ ఫలితం గురించి సుజిత్ ఎంత టెన్షన్ పడిపోతున్నాడో అర్ధం అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: