నా పేరు సూర్య   తరువాత  ఏడాది గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్..ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకు  ఏకంగా మూడు సినిమాలను చేయనున్నట్లు  ప్రకటించాడు. అందులో భాగంగా బన్నీ  ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కాగా  శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు.  అందులో భాగంగా  ప్రస్తుతం ఈసినిమా  షూటింగ్ గత కొద్దీ రోజులనుండీ   కాకినాడ లో  జరుగుతుంది. 


కాగా ఈ చిత్రం యొక్క టైటిల్ ఇదే నంటూ ఇటీవల రకరకాల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా నాన్న నేను, అలకనంద ,  అనే పేర్లు ఎక్కువగా వినిపించాయి.  కాగా తాజాగా ఈ సినిమాకు  'వైకుంఠపురం' అనే టైటిల్ ను ఖరారు చేశారని నిన్నటి రాత్రి నుండి వార్తలు వచ్చాయి.  అయితే సినిమా పూర్తి టైటిల్ అది కాదట.    ఫిలిం వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈచిత్రానికి 'అల వైకుంఠపురంలో' అనే టైటిల్ ను ఖరారు చేశారట. కాగా  ఈచిత్రం యొక్క  టైటిల్ ను ఆగస్టు 15న  రివీల్ చేయనున్నారు.



తండ్రి, కొడుకుల మధ్య  జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.  కాగా సీనియర్ నటి టబు ,ప్రముఖ  మలయాళీ నటుడు జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు  కీలక పాత్రల్లో  నటిస్తుండగా  హారిక హాసిని క్రియేషన్స్  గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఇక ఈసినిమా తరువాత బన్నీ సుకుమార్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఈసినిమాతో పాటు ఎమ్ సి ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో  ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్. 



మరింత సమాచారం తెలుసుకోండి: