హాట్ యాంకర్  అనసూయను ఎంతోమంది విమర్శించినా ఆమె క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. స్టార్ హీరోయిన్స్ కు ఉండే స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ హాట్ యాంకర్ ఒక సెన్సేషనల్ ఫోటో షూట్‌ కు పోజులు ఇచ్చింది. ‘ఎవ్వరైనా సరే తనను రీప్లేస్ చేయడం కష్టం’ అంటూ కామెంట్స్ పెట్టి ఈమె తన లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ట్విటర్ లో షేర్ చేసింది.

ఈ ఫోటోలకు ఆమె ‘మండే మోటివేషన్’ అనే హాష్ ట్యాగ్. జత చేసింది. దీనితో ఈ ఫోటో షూట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటో షూట్ లో అనసూయ అందాలు యంగ్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కు మించి ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ‘జబర్దస్త్’ యాంకర్ రష్మీతో పోల్చుతూ ''ఒకప్పుడు రష్మీ బాగా ఎక్స్ పోజ్ చేస్తుంది అనుకున్నా.. ఇప్పుడు మీరు మొదలెట్టారా? మా రష్మీనే బంగారం, ఇప్పుడు ఎక్స్ పోజింగ్ మానేసింది'' అంటూ అనసూయ పై సెటైర్లు వేస్తున్నారు.

ఎప్పటిలాగే తన ఫోటో షూట్ పై విమర్శలు చేస్తున్న వారి పై విరుచుకు పడుతోంది అనసూయ. తెలుగు అమ్మాయిని అవ్వడం వల్లనే ఫోటో షూట్ లకు అభ్యంతరాలు వస్తున్నాయని అదే తాను బాలీవుడ్ అమ్మాయిని అయి ఉంటే ప్రశంసలు వచ్చి ఉండేవి అంటూ కామెంట్స్ చేస్తోంది. 

ఒక స్త్రీ వేసుకునే బట్టల విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ బూతులు మాట్లాడే వ్యక్తుల మనస్థత్వం పై మాట్లాడుతూ తల్లి తండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటి వల్గర్ ఆలోచనలు జనానికి వస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనసూయ ఇంత డేరింగ్ గా ఫోటో షూట్స్ ఇచ్చి తన క్రేజ్ ను పెంచుకుంటున్నా ఆమె లేటెస్ట్ గా నటించిన ‘కథనం’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో కేవలం బూతు షూట్స్ తో ఏర్పడ్డ ఇమేజ్ తో హీరోయిన్ గా రాణించడం కష్టం అన్న విషయం ఇప్పటికే అనసూయకు అర్ధం అయి ఉండాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: