బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌, డా.ఏయ‌స్ కీర్తి, డా.జి.పార్థ సార‌ధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. ఈ చిత్రం ఆడియో ఇటీవల తిరుపతి లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...``ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్‌`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచి తో చిత్రాన్ని నిర్మించారు.  హీరో , హీరోయిన్స్  మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది.  కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.  ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.   


ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డి అభిన‌య మాట్లాడుతూ...``ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత మొదటిసారిగా మా ఆడియో ఫంక్షన్ కి పృథ్వి గారు రావడం చాలా  సంతోషం గా ఉంది. ఇక  నిర్మాత‌లు న‌న్ను , నా క‌థ‌ని న‌మ్మి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. పాట‌ల షూటింగ్ కోసం  వెళ్లిన‌ప్పుడు చిక్ మంగుళూరు లో కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా వాట‌న్నింటినీ అధిగ‌మించి షూటింగ్ కంప్లీట్ చేశాం. ఇటీవల సెన్సార్ పూర్తి చేసాం. సెన్సార్ సభ్యులు  ప్రశంసించారు.  సినిమాను   ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. 
నిర్మాత డా.పార్థ‌సార‌ధి రెడ్డి మాట్లాడుతూ...``ఎన్నో వ్య‌య ప్ర‌యాల‌స‌కోర్చి సినిమా చేశాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా`` అన్నారు.


మరో  నిర్మాత , స‌మ‌ర్ప‌కులు  డా. య‌ల‌మంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ...``ఎంతో పాష‌న్ తో ఈ సినిమా చేశాం. అంతే పాష‌న్ తో ఉన్న ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. గ్రాండ్ గా సినిమాను ఈ నెల 23 న రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: