పవన్ కళ్యాణ్ రికార్డును టార్గెట్ గా చేసుకునే మహేష్ బాబు అలుపెరుగక పాటుపడుతున్నాడని టాలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏరంగం అయినా ప్రొఫెషనల్ వార్ ఉంటుందన్నది అందరికి తెలిసిందే. అలాంటిదే సినిమారంగంలో కూడా స్టార్ వార్ ఉన్నదన్నది అందరికి తెలిసిందే. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో బిగ్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద చెరగని రికార్డు సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే కదా. అందుకే మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా తన ‘ఆగడు’ సినిమా కోసం కష్టపడుతున్నాడట. అయితే ఆయన ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే ‘వన్ –నేనొక్కడినే’ సినిమాతో తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే పవన్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాడట, అయితే వెంటనే వచ్చే ‘ఆగడు’ తో ఇక పవన్ ను మించిన రికార్డు సాధించాలన్నది మహేష్ తపన అంటున్నారు. తమన్నా తో తొలిసారి జోడికడుతుండమే కాకుండా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందంల అధ్బుత ప్రతిభతో ఈ సినిమా టాలివుడ్ రికార్డులను బద్దలు చేస్తుంది అని చెప్పారు దర్శకుడు శ్రీను వైట్ల. నవంబర్ 15 నుంచి షూటింగ్ ప్రారంభం అయి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: