పరిస్థితులు అనుకూలించక సినిమాల్లో ఇబ్బందులు పడుతున్న రాంచరణ్ ఆ ఇబ్బందుల నుంచి బయట పడడానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళిని తెగ రాకుతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో. ఈ ఏడాది నాయక్ తో మొదలు పెట్టిన రాంచరణ్ కు ఈ ఏడాది పూర్తవుతున్నా ఎలాంటి హిట్టు లేక తెగ దిగాలు పడ్డ విషయం అందరికి తెలిసిందే. విడుదలయిన జంజీర్ హిందీలో, తెలుగులో తూఫాన్ రాంచరణ్ ఇమేజిని దారుణంగా దెబ్బతీసాయి. అంతో ఇంతో కవరేజి ఇస్తుందనుకున్న ‘ఎవడు’ ఎప్పుడు విడుదలవుతుందో తెలియక తెగ తికమక పడుతోంది. విడుదల ఆలస్యమవుతుండడంతో ఆ సినిమాపై కూడా రాంచరణ్ అంతగా ఆశలు పెట్టుకోలేదట. అందుకే అదిరిపోయే మగధీర లాంటి సినిమా తీసి మరోసారి తన స్టార్ డమ్ చూపెట్టుకోవాలని తహతహా లాడుతున్నాడు అంటున్నారు. అందుకే ప్రభాస్ తో బాహుబలి సినిమా తర్వాత ఎవరితోను సినిమాకు ఒప్పుకోవద్దు, తనతోనే బిగ్ హిట్ తీయాలి అంటూ రాజమౌళిపై తెగ ఒత్తిడి తెస్తున్నాడు రాంచరణ్ అని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: