టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకుల మదిని దోచారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రభాస్, దేశవ్యాప్తంగా ఎందరో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఇక ఇటీవల ఆయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాలు అద్భుత విజయాలను అందుకుని ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. 

ఇక అతి త్వరలో ఆయన హీరోగా రూపొందుతున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఆయన ఫ్యాన్స్ అప్పుడే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హడావుడి మొదలెట్టేసారు. ఇకపోతే నేడు ప్రభాస్ పై అలానే సాహో సినిమాపై శ్రీరెడ్డి కొన్ని కామెంట్స్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రభాస్ వ్యక్తిత్వం ఎంతో బాగుంటుందని, ఎప్పుడూ ప్రశాంతంగా, పద్దతిగా వ్యవహరించే ప్రభాస్ గారు, కూర్చోవడంలో కూడా మంచి రాజసాన్ని ప్రదర్శిస్తారని, అటువంటి డ్రీం బాయ్ ని అందరూ ఇష్టపడతారు అంటూ కామెంట్ చేసింది. 

అంతేకాక తనకు అతి త్వరలో రిలీజ్ కానున్న ప్రభాస్ సాహో సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉందని తన మనసు తనకు చెప్తోందని కూడా శ్రీ రెడ్డి మరొక పోస్ట్ ద్వారా తెలిపింది. నిజానికి పవన్ కళ్యాణ్, నాని వంటి పలువురు సినిమా నటులపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ పోస్టులు చేసే శ్రీరెడ్డి, సడన్ గా ఈ విధంగా ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తూ, ఇంతలా ఎందుకు పోస్టులు చేస్తోంది అనేది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే కొందరు మాత్రం ఆమె ఇదంతా తనపై ప్రభాస్ ఫ్యాన్స్ నుండి సింపతి కోసం చేస్తుంది అంటుంటే, మరికొందరు మాత్రం ఇదంతా శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం చేస్తున్న సరికొత్త స్టంట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  కాగా శ్రీరెడ్డి చేసిన ఆ పోస్టులు ప్రస్తతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: