ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా రూ.350 కోట్ల వరకు బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ నిర్మించడం జరిగింది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత, ఒక్కసారిగా సినిమా పైన ఉన్న అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో యూనిట్ సభ్యులు మరియు పలువురు అతిథుల సమక్షంలో ఎంతో వేడుకగా జరుగనుంది. ఇకపోతే ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు. 

అందుతున్న సమాచారం ప్రకారం, రిలీజ్ రోజున మన రెండు తెలుగు రాష్ట్రాల సహా, చాలా ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ మన తెలుగు హీరోల్లోని బడా సూపర్ స్టార్స్ లో ఒకరు కాబట్టి ఇక్కడ ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయి. ఇక అలానే బాహుబలి సినిమాల విజయాల తరువాత ప్రభాస్ కు హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా ఫుల్ క్రేజ్ రావడంతో మిగతా భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటిస్తుండడం కూడా మరొక పెద్ద ప్లస్ కానున్నట్లు చెప్తున్నారు సినిమా విశ్లేషకులు. 

వారు చెప్తున్న ప్రకారం, ప్రభాస్ కు బాహుబలితో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చినప్పటికీ, శ్రద్ధ కపూర్ బాలీవుడ్ బడా హీరోయిన్స్ లో ఒకరు కావడంతో ఆమె ద్వారా కూడా మరింత క్రేజ్ సినిమాకు వచ్చే అవకాశం కూడా కనపడుతోందట. మరి వారు చెపుతున్న దానిని బట్టి చూస్తుంటే, ఈనెల 30న సూపర్ క్రేజ్ తో రిలీజ్ కానున్న సాహో, ఏ మాత్రం బాగుందనే టాక్ ని సంపాదిస్తే మాత్రం, అటు ప్రభాస్, అటు శ్రద్దల క్రేజ్ తో సినిమాకు అద్భుతమైన రీతిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: