యంగ్ హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్  'కార్తికేయ' 2014లో విడుదలై  సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పుడు 5 ఏళ్ళ తరువాత  అదే  కాంబినేషన్ లో  ఈ చిత్రానికి  సీక్వెల్ ను చేయడానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది.  కాగా   ఫస్ట్ పార్ట్ లో నటించిన నటీనటులు అందరూ ఈ సీక్వెల్  లో కూడా  కనిపించనున్నారు.  వీరితోపాటు గా మరో హీరోయిన్ ను  తీసుకోనున్నారు.అయితే  ఈ సీక్వెల్ కు కార్తికేయ 2 అనే టైటిల్ కాకుండా వేరే టైటిల్ నుపెట్టాలని భావిస్తున్నారట మేకర్స్.   ఇక ఈ చిత్రం  కుంభమేళా  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట.  దాంతో ఈ చిత్రాన్ని ఉత్తరాఖాండ్ , హిమాచల్ ప్రదేశ్ మొదలుగు ప్రాంతల్లో చిత్రీకరించనున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై టిజి విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఇక  కిరాక్ పార్టీ తరువాత నిఖిల్ అర్జున్ సురవరం అనే చిత్రంలో నటించాడు. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ థియేటర్లలోకి మాత్రం తీసుకురాలేకపోతున్నారు. ఇటీవల పలు సార్లు  రిలీజ్ డేట్స్ ప్రకటించి అనివార్యకారణాల వల్ల వాయిదా వేశారు. కాగా ఇప్పుడు ఈ సినిమా గురించి అస్సలు ప్రస్తావనే లేదు. మరి ఈసినిమా విడుదలవుతుందోలేదో చూడాలి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఖనితన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో  నటించాడు.  రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్  సంయుక్తంగా  నిర్మించిన  ఈ చిత్రంలో  నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది



మరింత సమాచారం తెలుసుకోండి: