అక్కినేని నాగ చైతన్య మజిలీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వెంకటేష్ తో కలిసి 'వెంకీ మామ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 'వెంకీ మామ' సినిమాలో మామ అల్లుళ్లుగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేయబోతున్నారు వెంకీ-చైతు. జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి దసరాకి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఫస్ట్ టైం చైతు తో కలిసి వెంకీ ఫుల్లెంత్ కామెడి చేస్తుండగా 'జై లవకుశ' తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

అయితే ఈ సినిమా తర్వాత వెంటనే శేఖర్ కమ్ములతో సినిమా చేసేలా ప్లాన్ చేసుకున్నాడు చైతు. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందని లేటెస్ట్ న్యూస్. అయితే చైతు కోసం తను రాసుకున్న ఓ కథను మళ్లీ మార్పులు చేసి సినిమా చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. చైతు సరసన ఫిదా సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని సనాహాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమా తర్వాత చైతు కి మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 

వాస్తవంగా చెప్పాలంటే చైతు శేఖర్ కమ్ముల సినిమా తర్వాత మెర్లపాక గాంధీ తో యూ.వీ.క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో శశి అనే దర్శకుడితో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు కాకుండా మరో రెండు కథలు ఫైనల్ అయ్యాయని ఫ్రెష్ అప్‌డేట్. మరి అక్కినేని యంగ్ హీరో ముందుగా యూ.వి కె సినిమా చేస్తాడో..లేదా దిల్ రాజు కి డేట్స్ ఇస్తాడో..చూడాలి. ఏదేమైనా చైతు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టి రెండేళ్ళ వరకు బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే చైతు-శేఖర్ కమ్ముల సినిమాలో ఫిదా పిల్ల ఫైనల్ అయిపోయింది. మిగతా సినిమాలలో ఒక్క సినిమాలోనైనా మళ్ళీ మజిలీ జోడి కనిపిస్తుందా..లేదా..అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: