రాబోతున్న సంక్రాంతి రేస్ మహేష్ బన్నీల వార్ గా మారబోతోంది అన్నవార్తలు వచ్చిన నేపధ్యంలో ఎలర్ట్ అయిన త్రివిక్రమ్ తెలివిగా నడిపిన రాయబారాలతో మహేష్ బన్నీల మధ్య రాజీ కుదిరింది అన్నవార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 10న అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ జనవరి 11న విడుదల చేయాలని ఈ మూవీ నిర్మాతలు సన్నాహాలు మొదలు పెట్టడంతో మహేష్ బన్నీల వార్ తప్పదు అన్న సంకేతాలు వచ్చాయి. 

అయితే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. దీనితో మహేష్ బన్నీల సినిమాల మధ్య 4 రోజులు గ్యాప్ ఉండటంతో ఈ మూవీల బయ్యర్లకు ఈ పోటీ వల్ల ఎటువంటి నష్టం లేకుండా రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు నాలుగు రోజుల గ్యాప్ మహేష్ బన్నీల సినిమాల మధ్య ఉంటుంది కాబట్టి ధియేటర్ల సమస్య కూడ ఉండదని భావిస్తున్నారు. సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి రెండు పెద్ద హీరోల సినిమాలు వచ్చినా కలక్షన్స్ విషయంలో సమస్యలు ఉండవు కాబట్టి మహేష్ అల్లు అర్జున్ లకు ఇరువురికీ నష్టం లేకుండా ఈ రాజీ మార్గం డిజైన్ చేసినట్లు టాక్.

ఇప్పటికే త్రివిక్రమ్ బన్నీల మూవీకి ‘వైకుంఠపురంలో’ అన్న టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ టైటిల్ వెనుక ఒక అర్ధం ఉంది అని అంటున్నారు. త్రివిక్రమ్ ఈ మూవీ మూల కథను పోతన వ్రాసిన మహాభాగవతం నుండి స్ఫూర్తి పొందిన ఒక పాయింట్ ను ఆధారంగా తీసుకుని అల్లినట్లు టాక్. భాగవతంలో కనిపించే బలరాముడు శ్రీకృష్ణుడుల పాత్రల మాదిరిగా త్రివిక్రమ్ మూవీలో అల్లు అర్జున్ నవదీప్ ల పాత్రలు డిజైన్ చేయబడి ఈ మూవీని చూసేవారికి మహాభాగవంతంలోని కొన్ని ఘట్టాలు గుర్తుకు వస్తాయి అని అంటున్నారు. అందుకోసమే శ్రీమహావిష్ణువు కొలువై ఉండే వైకుంఠoను గుర్తుకు చేస్తూ ఈ మూవీకి ‘వైకుంఠపురంలో’ అన్న పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: