ప్రభాస్ సాహో రిలీజ్ కు సిద్ధం అవుతున్నాడు.  ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేశారు.  యూట్యూబ్ లో సంచనాలు సృష్టిస్తోంది ట్రైలర్.  దీంతో పాటు సాహో వీడియో గేమ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు.  ఆగస్టు 15 వ తేదీన ఈ గేమ్ రిలీజ్ కాబోతున్నది.  గేమ్ కోసం చాలా ఖర్చు పెట్టారు.  యాక్షన్ సినిమాలకు గేమ్స్ ను రిలీజ్ చేయడం హాలీవుడ్ లో చూస్తుంటాం.  నిర్మాతలకు ఇది అదనపు ఆదాయంగా లభిస్తుంది.  


దీనినే యూవీ క్రియేషన్స్ టీం ఫాలో అవుతున్నది.  ఆగస్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఉన్నారు.  అయితే ఇందులోని రెండు పాటలను మాత్రమే రిలీజ్ చేశారు. 


త్వరలోనే మూడో సాంగ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.  ఇదిలా ఉంటె, బాహుబలి తరువాత ప్రభాస్ ఓ మాట చేశారు.  బాహుబలి సీరీస్ కోసం ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాడు.  తరువాత ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తానని అన్నాడు.  బాహుబలి 2 రిలీజ్ తరువాత సాహో స్టార్ట్ అయ్యింది.  


సినిమా పూర్తికావడానికి రెండేళ్ల సమయం పట్టింది. సాహో సినిమాపై ప్రభాస్ మరలా స్పందించాడు.  అనుకోకుండా రెండేళ్లు గడిచిపోయాయని, ఇకపైన అలా జరగదని అన్నాడు.  ఏడాదికి రెండు సినిమాలు ప్లాన్ చేస్తానని అంటున్నాడు.  ప్రభాస్ కు ఇండియా వైడ్ గా మార్కెట్ ఉన్నది.  అలాంటప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేయడం సాధ్యం కాదు.  


ఏడాదికి ఒక్కటి చేసినా గ్రేట్ అని చెప్పొచ్చు.  సాహో షూటింగ్ దశలో ఉండగానే జాన్ సినిమాను స్టార్ట్ చేశారు.  ఇది కూడా సొంత సినిమానే.  దాదాపు 20 రోజులపాటు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  పూజా హెగ్డే హీరోయిన్.  సాహో రిలీజ్ అయ్యాక దీనిపైనే దృష్టి పెట్టె అవకాశం ఉన్నది.  ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా కాడంతో ఎన్నేళ్లు పడుతుందో మరి.  ప్రభాస్ ఇచ్చిన మాట నిలుపుకుంటాడా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: