భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందిన చిత్రం "సాహో". బాహుబలి ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించింది. మొన్న విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలని చూడబోతున్నామని ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ మీడియకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.


అయితే గతంలో శ్రద్ధా కపూర్ భారత స్టార్ షట్లర్స్ లో సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి.సైనా నెహ్వాల్ భారత స్టార్ షట్లర్స్ లో  ఒకరు. ఆమె అనేక అంతర్జాతీయ వేదికలపై అపూర్వ విజయాలు సాధింది స్టార్ షట్లర్ గా గుర్తింపు పొందారు. ఐతే ఆమె బయో పిక్ హిందీలో తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.’సైనా’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైనాగా పరిణీతి చోప్రా నటిస్తున్నారు. అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.


ఐతే ఈ మూవీలో మొదట హీరోయిన్ గా శ్రద్దా కపూర్ అనుకోవడం జరిగింది. ఈ చిత్రం కొరకు కొద్దిరోజులు నిపుణుల పర్యవేక్షణలో ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు. ఏమైందో తెలియదు సడన్ గా ఆ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నారు. దానికి కారణం అడగగా సాహో సినిమాలో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలనే ఈ మూవీ వదిలేశానంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ మూవీ కొరకు పరిణితీ చోప్రా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు ౩౦ న విడుదల కాబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: