రజినీకాంత్ వరసగా రెండు విజయాలు సాధించి దూసుకుపోతున్నాడు. రోబో 2పాయింట్ 0, పేట సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ దర్బార్ సినిమా చేస్తున్నాడు. మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మురుగదాస్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నది.
దాదాపు 25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. దీన్ని పక్కన పెడితే.. రజినీకాంత్ 2పాయింట్ 0 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పకే రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ దాదాపుగా రూ. 800 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. చైనాలో మినహా అన్ని దేశాల్లో రిలీజ్ చేశారు.
జులై 12 వ తేదీన చైనాలో సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. అదే సమయంలో డిస్ని ది లయన్ కింగ్ ఉండటంతో సినిమాను వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 6 వ తేదీన చైనాలో 47000 3డి థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒక ఇండియన్ సినిమా స్థాయి థియేటర్స్ లో రిలీజ్ కావడం గ్రేట్ అని చెప్పాలి. అక్కడ 2పాయింట్ 0 సినిమా హిట్ కొట్టింది అంటే.. రజిని సినిమాకు క్రేజ్ వచ్చినట్టే. అక్కడ వాళ్లకు ఇలాంటి సినిమాలు కొత్త కాకపోయినా.. ఇండియన్ సినిమా స్క్రీన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ పెరిగింది. సినిమా బాగుంది అంటే తప్పకుండా కనీసం 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధిస్తుంది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. హిట్ అయ్యింది అంటే.. దర్శకుడు శంకర్ కు హాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం తప్పకుండా వస్తుంది.