రానా , సాయి పల్లవి జంటగా 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం సాయి పల్లవి ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ను కీలక పాత్రకు తీసుకున్నారు. అయితే టబు ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమాకు అలాగే మరికొన్ని హిందీ సినిమాలకు కూడా సైన్ చేసింది. దాంతో విరాటపర్వం కు డేట్స్ కేటాయించలేనని ఈసినిమానుండి ఆమె తప్పుకుంది.
దాంతో ఆమె స్థానాన్ని ప్రముఖ నటి, డైరెక్టర్ నందితా దాస్ తో భర్తీ చేసారు మేకర్స్. కాగా ఈసినిమా గురించి ట్విట్టర్ ద్వారా నందితా ప్రస్తావిస్తూ.. సినిమాలో నేను ఎవరిని రీప్లేస్ చేశానో తెలియదు కానీ .. ఈస్క్రిప్ట్ మాత్రం చాలా నచ్చింది. నిన్నటి నుండి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాను అంటూ ట్వీట్ చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నందిత దాస్ మానవ హక్కుల నేతగా కనిపించనుందని సమాచారం.
ఇక రానా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించనుండగా సెప్టెంబర్ నుండి ఆయన షూటింగ్ లో పాల్గొనన్నాడు. కాగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈసినిమాలో సాయి పల్లవి వరంగల్ అమ్మాయి గా ,నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల ఫై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.