సాధారణంగా సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ఏదైనా కార్యక్రమాలు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ లేదా ఏదైనా చానల్స్ ఇంటర్వ్యూల్లో కానీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు.  ఆమెతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని..ఎంతో యాక్టీవ్ గా ఉంటుందని హీరోయిన్ ని హీరో పొగిడితే..ఆయనతో నటించడం ఎంతో కంఫర్ట్ బుల్ గా ఉందని హీరోని హీరోయిన్ పొగడుతూ ఉంటుంది.  ఇది సినిమా ప్రమోషన్ అయినా..మరేదైనా ఎవరినీ ఎవరూ విమర్శించుకోరు.  కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేయడం చూస్తుంటాం.

గతంలో రక్తచరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి నందమూరి బాలకృష్ణతో రెండు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఇలాంటి సందర్భాలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడు విమల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముత్తుకుమారన్‌ దర్శకత్వంలో వరలక్ష్మీ, విమల్‌ జటంగా ‘కాన్ని రాశి’ సినిమా వస్తుంది.  ఈ మూవీ ప్రమోషన్  కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి, విమల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావించారు.  గతంలో కూడా తన పెళ్లి విషయం గురించి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పానని..పెళ్లి చేసుకుంటానా, చేసుకోనా అనేది అది పెద్దలు కుదిర్చిన వివాహమా అనే విషయం పక్కన బెడితే తాను అసలు పెళ్లే చేసుకోనని చెప్పింది.  ఆ తర్వాత విమల్ మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించాను’ అనేశారు. ఆ తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ.. అబ్బే నా ఉద్దేశం అది కాదు..వరలక్ష్మీ చాలా గొప్ప నటి అని ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుందని, ఎలాంటి వారితో అయినా చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటారని కవరింగ్ చేశాడు. విమల్ తన వ్యాఖ్యలు కవరింగ్ చేసుకున్నా ట్రోలింగ్ మాత్రం బాగానే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: