ఎన్టీఆర్ రీసెంట్ ఫిల్మ్ రామయ్యవస్తావయ్యా పరాభవం కావడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితిగా మారింది. ఎంతో నమ్మకంతో హరీష్కు మూవీను ఇస్తే, చాలా సింపుల్గా మూవీను ఫినిష్ చేసి, బిగ్ డిజాస్టర్ను ఇచ్చాడు. మొదటి నుండి మూవీలో ఏదో తేడా అని, ఒకసారి సరిచూసుకో అని నిర్మాత,హీరో డైరెక్టర్కు ఎంత చెప్పినా, తను మాత్రం లైట్ తీసుకొని మూవీకు పరాభవాన్ని మిగిల్చాడు.
దీంతో ఎన్టీఆర్ కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. మొత్తంగా చెప్పాలంటే మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఊధరగొట్టే కథలను తీసుకువస్తున్న డైరెక్టర్స్ను దూరంగా పెడుతున్నాడు. వాళ్ళకు మాత్రం దయచేసి అటువంటి కథలను తీసుకురావద్దు అని మరీ చెబుతున్నాడు. రభస మూవీ తరువాత కొరటాల శివకు ఓకె చెప్పిన ఎన్టీఆర్, ఆ కథను పకడ్బంధీగా తయారుచేయాలని మరోసారి కొరటాలకు చెప్పాడు. అయితే కొరటాల, ప్రిన్స్ మూవీకు రెడీ కావడంలో ఎన్టీఆర్,కొరటాల కాంబినేషన్పై కూడ నీలినీడలు కమ్ముకున్నాయి.
ఏదేమైనా ఎన్టీఆర్ మాత్రం ఈ సారి కథల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. కథ బలంగా ఉంటేనే రండి అంటూ స్టోరీలను వినిపించే డైరెక్టర్స్కు ముందుగా చెబుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ వద్దకు ఏదో ఒక కథతో వచ్చి మాటలు చెప్పి కన్విన్స్ చేద్ధాం అనుకునే డైరెక్టర్స్ మరోసారి కథను తిరిగి రాసుకునే పనిలో ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: