పెళ్లి చూపులు ఫేమ్  తరుణ్ భాస్కర్  తెరకెక్కించిన  ఈ నగరానికి ఏమైంది ? అనే చిత్రం లో ఓ హీరోగా నటించి  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు  యంగ్ హీరో విశ్వక్ సేన్.  అయితే ఈ సినిమా  అంచనాలకు  తగ్గట్లుగా ఆడకపోవడంతో  విశ్వక్ సేన్ కు పెద్దగా  పేరును తీసుకురాలేదు.   ఈసినిమా తరువాత సోలో హీరోగా ఇటీవల  ఫలక్ నుమా దాస్ అనే సినిమాతో ప్రేక్షకులకుముందుకు వచ్చి రచ్చ రచ్చ చేసాడు  విశ్వక్ సేన్.   మే లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకులతోపాటు ప్రేక్షకులను కూడా  మెప్పించలేకపోయింది కానీ వివాదల్లోకి ఎక్కడం వల్ల  మంచి వసూళ్ల  ను తెచ్చిపెట్టడమే కాకుండా  విశ్వక్ సేన్ కు  యూత్ లో క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది.   



ఇక ఈచిత్రం తరువాత విశ్వక్ సేన్ మరో సినిమాకు సైన్ చేశాడు. అయితే ఈసారి ఏకంగా  టైటిల్ తోనే  రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు ఈ హీరో. నూతన దర్శకుడు నరేష్ రెడ్డి కుప్పిలి  డైరెక్షన్ లో విశ్వక్ సేన్ ,పాగల్ అనే చిత్రంలో నటించనున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో  తెరకెక్కనున్న ఈ చిత్రం  సెప్టెంబర్ రెండవ వారం నుండి సెట్స్  మీదకు వెళ్లనుంది.

 

ఇక  "టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్  ఇటీవల కొత్త వాళ్ళతో  "హుషారు" అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను నిర్మించి  సూపర్ హిట్ కొట్టారు.  ఇక ఈ పాగల్ నుకూడా  లక్కీ మీడియా బ్యానర్ ఫై  బెక్కం వేణుగోపాలే నిర్మించనున్నాడు. కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నారట. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: