ఎన్టీఆర్ తాను ఫెయిల్ టాక్ నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడి తీస్తున్న ‘రభస’ విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నాడంటున్నారు. అసలే దమ్ము, తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రామయ్యా వస్తావయ్యా’ కూడా ఎన్టీఆర్ ను దిగాలుకు గురిచేసిన విషయం తెలిసిందే. అందుకే ఆ పొరపాటు మళ్లీ చేసి పూర్తిగా కోలుకోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ‘రభస’ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసాడట. అంటే సినిమా స్టోరిపై కాదు ఆ టైటిల్ బాగా లేదని ఇది ప్రేక్షకులను ఆకట్టుకోదని అని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు అంటున్నారు. అందుకు రభస కు బదులు ‘జోరు’ అని టైటిల్ పెట్టాలని నిర్ణయించారు అంటున్నారు. అంతే కాదు ‘అత్తారింటికి దారేది’ సినిమా సెంటిమెంట్ ను కూడా వాడుకుంటున్నట్లు సమాచారం. కారణం ఈ సినిమాలో అత్తారింటి జోడి సమంత, ప్రణీతలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: