టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ గత ఏడాది మెగాస్టార్ బర్త్ డే రోజున రిలీజయి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. అయితే ఆ టీజర్ తరువాత గడచిన ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు సైరా టీమ్ నుండి మరొక టీజర్ ఏది రిలీజ్ కాలేదు. ఇక మరికొద్దిరోజుల్లో మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఆ రోజున ఈ సినిమా అధికారిక ట్రైలర్ రిలీజ్ కానుంది అంటూ ఇప్పటికే పలు మీడియా మద్యంలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసందే. 

ఇక పాన్ ఇండియా అపీల్ ఉండేలా దాదాపుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఇక నిన్న ఈ సినిమా హిందీ రైట్స్ ను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఏ ఫిలిమ్స్ ఇండియా వారు కొనుగోలు చేసినట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ వారు తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరచడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా మేకింగ్ వీడియోను నేటి మధ్యాహ్నం 3గం. 45ని.లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. అయితే ఇందులో ఒక పెద్ద సర్ప్రైజ్ దాగివుందని సమాచారం. 

అదేమిటంటే, సినిమాలోని పలు లొకేషన్స్, సెట్టింగ్స్ వంటి షాట్స్ తో రూపొందిన ఆ మేకింగ్ వీడియోకు వాయిస్ ఓవర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందించినట్లుగా నేడు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై సైరా టీమ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేద్దాం అనే ఉద్దేశ్యంతోనే సైరా టీమ్ ఆ విషయాన్ని దాచిపెట్టినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో మనకు మరొక రెండు గంటల్లో తెలిసిపోనుంది. ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే, మెగాఫ్యాన్స్ కు ఇది మెగాస్టార్, పవర్ స్టార్ కలయికతో డబుల్ ట్రీట్ అనే అనాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: