దర్శకుడు పూరీ జగన్నాథ్,అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. పూరీ జగన్నాథ్ ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర అలీ కోసం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాత్రలు అలీకి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. పూరీ దర్శకత్వం వహించిన ఇడియట్. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లోని పాత్రలు అలీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
 
ఇటీవల జరిగిన పండుగాడి ఫోటో స్టూడియో ఫంక్షన్లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఆస్తులు అన్నీ అమ్మేశానని, సొంత ఆఫీస్ కూడా అమ్మేశానని అలాంటి సమయంలో అలీ చేసిన సాయం మరిచిపోలేనని చెప్పాడు . ఆస్తులు అన్నీ అమ్మేసిన సమయంలో అలీ తన దగ్గరకు వచ్చాడని మూడు, నాలుగు లక్షల విలువ గల కుంకుమ పూసిన బంగారు గొలుసు ఇచ్చి, ఈ బంగారు గొలుసు ఉంచుకుంటే కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయని చెప్పాడని పూరీ చెప్పారు. 
 
అలీ చెప్పిన విధంగానే కోల్పోయినవన్నీ తిరిగి పొందగలిగానని పూరీ చెప్పారు. తాను సంతోషంగా ఉంటే అలీ ఒక బొకే ఇస్తాడని, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒక పెగ్ మందు పోసి వెళతాడని పూరీ జగన్నాథ్ అన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అలీ నటించకపోయినప్పటికీ భవిష్యత్తులో తీసే సినిమాలో అలీకి తప్పకుండా పాత్ర ఉంటుందని పూరీ జగన్నాథ్ అన్నారు. 
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా 25 రోజుల్లో 40 కోట్ల రుపాయల షేర్ వసూళ్ళు సాధించింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఇంకా షేర్ వసూళ్ళు వస్తున్నాయి. పూరీ ప్రస్తుతం తరువాత సినిమాకు కథ, కథనం సిధ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ తరువాత సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. 2020 జనవరి నుండి పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా మొదలుకాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: