సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ కోసం మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి 'సైరా మేకింగ్ వీడియో'ను రిలీజ్ చేసింది చిత్రబృందం. చాల గ్రాండ్ గా ఉన్న ఈ మేకింగ్ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఇప్పుడు మెగా మేకింగ్ ట్రీట్ ఇచ్చిన సైరా టీమ్, ఈ నెల 20న ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ చేసి.. మెగా టీజర్ ట్రీట్ ఇవ్వనుంది. ఇక టీజర్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. పైగా అమితాబ్ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క ఇలా ప్రతీ ఒక్క ఇండస్ట్రీకు సంబంధించి అగ్ర నటులంతా ఈ సినిమాలో కనిపించడంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఆగష్టు 15న ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్నారు. అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో ఈ స్పెషల్ పోస్టర్ విడుదల కానుంది. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.
అలాగే ఈ చిత్రం ట్రైలర్ కోసం కూడా అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను విడుదలకి రెండు వారాలు సమయం ఉందనగా విడుదల చేసినట్టయితే.. సినిమా పై ఉన్న అంచనాల కన్నా మరిన్ని అంచనాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి విషయంలో రాజమౌళి కూడా ఇలాంటి టైపు ప్రమోషన్స్ నే చేశాడు. అయితే తన తండ్రి సినిమా కావడంతో ఈ చిత్రానికి నిర్మతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు, అదే విధంగా అంతే స్థాయిలో సినిమాని ప్రమోట్ చేస్తే మాత్రం సైరా సరి కొత్త రికార్డ్ లు సృష్టించడం ఖాయం.
https://www.youtube.com/watch?v=Ix1I3ksnPmg&feature=youtu.be