శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందంలో అమ్మకు ఏ మాత్రం తీసిపోదు.  సినిమా రంగంలోకి వచ్చింది ఇప్పుడే కాబట్టి టాలెంట్ ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది.  దఢక్ ఒక్కటే సినిమా చేసింది.  అందులో యాక్టింగ్ తో అదరగొట్టింది.  సో, సినిమా రంగంలో దూసుకుపోవడానికి ఛాన్స్ దొరికింది.  


ఇప్పుడు ఈ అమ్మడు కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో నటిస్తోంది.  అలానే కార్గిల్ గర్ల్ సినిమాలో చేస్తోంది.  ఈ సినిమాలే కాకుండా మరికొన్ని లైన్లో ఉన్నాయి. తెలుగులో మంచి సినిమా చేయించాలని శ్రీదేవి కోరిక.  కానీ, ఆమె కోరిక తీరకుండానే కన్ను మూసింది.  జాన్వీ తెలుగు ఎంట్రీ ఎప్పుడో కాలమే నిర్ణయిస్తుంది.  


ఇదిలా ఉంటె, శ్రీదేవి లాంటి నటన, రూపంతో పాటు ఆమెలోని మంచితనాన్ని కూడా పుణికి పుచ్చుకుంది.  ముంబైలో జాన్వీ కపూర్ జిమ్ కు వెళ్లి బయటకు వస్తున్న సమయంలో ఓ బాలుడు తన దగ్గర ఉన్న మ్యాగజైన్ కొనమని బతిమిలాడాడు.  అయితే, జాన్వీ మొదట వద్దని చెప్పింది.  ఆ బాలుడు వదలకుండా అడగడంతో.. కారులో ఉన్న పర్స్ తీసి చూసింది.  తీరా చూస్తే అందులో డబ్బులు లేవు.  


వెంటనే కారు డ్రైవర్ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఆ బాలుడికి ఇచ్చి మ్యాగజైన్ కొనింది.  దీంతో ఆ బాలుడు జాన్వికి కృతజ్ఞతలు చెప్పాడు.  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాలీవుడ్ హీరోయిన్ పైగా బోనికపూర్ వంటి టాప్ ప్రొడ్యూసర్ కూతురు.. అయినా పర్స్ లో డబ్బులు లేకపోవడం ఏంటో మరి.  అంతేకదా కార్డులు చేతిలో ఉండగా డబ్బులు ఎందుకు దండగ అనుకుంటారు.  అందుకే అలా అప్పు తీసుకొని ఉంటుంది.  ఇంతకీ తీసుకున్న అప్పు ఇంటికి వెళ్ళాక తీర్చిందా లేదా.. ఏమో ఆమెకే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: