సూపర్ స్టార్ మహేష్ మహర్షి తర్వాత ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు అంటూ వస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.


ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడికి ఓకే చెబుతాడా అన్నది తెలియాల్సి ఉంది. అసలైతే పరశురాం డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని అనుకున్నారు కాని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ హీరోగా సినిమా ప్లాన్ చేశారు. పరశురాం డైరక్షన్ లోనే ఆ సినిమా ఉంటుందని అన్నారు. కొరటాల శివ ద్వారా మహేష్ ను కలిసి తన కథ వినిపించాడట పరశురాం.


అయితే కథ బాగా నచ్చినా సరే ప్రస్తుతం అలాంటి సినిమా తాను చేయలేనని చెప్పాడట. ఈమధ్య మహేష్ అన్ని సైలెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. పరశురాం కథ కూడా అలాంటి కథే అట. మహేష్ కూడా ఇక మీదట కాస్త ఎంటర్టైనింగ్ సినిమాల మీద ఫోకస్ పెడుతున్నాడని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ కోసం పరశురాం ఎదురుచూపులు వేస్ట్ అయ్యాయి.     


మహేష్ ఎలాగు కాదని చెప్పడంతో పరశురాం అదే కథను మరో హీరోతో చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. సుకుమార్ విషయంలో జరిగిందే పరశురాం విషయంలో కూడా రిపీట్ అయ్యింది. మహేష్ కు కథ నచ్చినా తను అడిగిన టైం ఇవ్వడం కుదరక దర్శకులంతా వేరే హీరోలను చూసుకుంటున్నారు. మరి మహేష్ పరశురాం కాంబో మూవీ ఇక లేనట్టే అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: