మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా.. నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్లలో వేగం పెంచుతోంది చిత్ర యూనిట్. ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల, హిందీ బాషల్లో నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఇంటరెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. సినిమాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఉన్న ప్రతి దారిని ఉపయోగిస్తున్నారు. సినిమా రిలీజవుతున్న ప్రతి బాషలో అక్కడ క్రేజ్ ఉన్న ఆర్టిస్టులను ఈ టీజర్ రిలీజ్ కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్.



అందులో భాగంగా ఈ సినిమా తమిళ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ తో రిలీజ్ చేయించాలని చరణ్ ప్రయత్నాలు ప్రారంభించాడట. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో రజినీకాంత్ చేత ఈ సినిమా ప్రమోషన్ చేయిస్తే సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని చరణ్ భావన. తమిళ ప్రజలకు కూడా సినిమా త్వరగా చేరుతుందని చరణ్ ఆలోచన. ఇందుకోసం రజినీకాంత్ ను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టాడట. చిరంజీవి – రజినీకాంత్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. కాబట్టి రామ్ చరణ్ కు రజినీని కలవడం పెద్ద విషయం కాబోదు. ఇదే జరిగితే ఈ సినిమాకు మంచి ప్రమోషన్ దొరికినట్టే.



రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇటివల రిలీజ్ చేసిన సైరా.. మేకింగ్ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ తోనే సినిమా ఎంత భారీగా తీసారో మేకింగ్ వీడియో చెప్తోంది. ఈ సినిమా తెలుగు టీజర్ ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా రెండు రోజుల ముందే ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: