మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'సైరా నర్సింహారెడ్డి'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.  కాగా నిన్న విడుదలైన ఈ చిత్రం యొక్క మేకింగ్ వీడియో సినిమా ఫై అంచనాలను మరింతగా పెంచేసింది.  పీరియాడికల్ మూవీ కావడం అలాగే విజువల్స్ గ్రాండియర్ గా ఉండడం తో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బజినెస్ బాగానే జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాతలు ఫర్హాన్ అక్తర్ , అనిల్ తడానీ భారీ ధరకు దక్కించుకోగా  తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ ను  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.  ఈ రైట్స్ విలువ సుమారు 34కోట్లని సమాచారం. దాంతో బాహుబలి సిరీస్ , సాహో తరువాత నైజాం లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా  సైరా రికార్డు క్రియేట్ చేసింది.




ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఆగస్టు 20న విడుదలచేయనున్నారు. ముంబై లో గ్రాండ్ గా ఈ టీజర్ ను విడుదలచేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా   బిగ్ బి అమితాబ్ బచ్చన్,   విజయ్ సేతుపతి , సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: