బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహోపై భారీ అంచనాలున్నాయి. సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సాహో సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు.


ఇప్పటికే ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా.. ఈ నెల 18న హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ లక్ష మందికి అవకాశం కల్పిస్తున్నారట. ఇప్పటికే ఆ లక్ష మందిని సెలెక్ట్ చేశారట. హైరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.


తమ అభిమాన నటుడిని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటారు. మరి ఒకేసారి లక్ష మంది ఫ్యాన్స్ మధ్య ప్రభాస్ చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన సాహో మరోసారి ప్రభాస్ స్టామినా చూపించేలా ఉందని చెప్పొచ్చు. బాహుబలితో వచ్చిన నేషనల్ వైడ్ క్రేజ్ ను సాహో కోసం ఫుల్ గా వాడేస్తున్నాడు.


సాహో కూడా అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం ఇక ప్రభాస్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు. సినిమాలో ఎన్నో అద్వ్హుతాలు ఉన్నా ఆడియెన్స్ థియేటర్ కు వచ్చి సర్ ప్రైజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. టీజర్, ట్రైలర్ లో కన్నా సినిమాలో ఇంకా ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని చిత్రయూనిట్ చెబుతూనే ఉన్నారు. మరి ఆగష్టు 30న వస్తున్న సాహో సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరో 15 రోజులు వెయిట్ చేయాల్సిందే.    



మరింత సమాచారం తెలుసుకోండి: