బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి చాలా ఆక్టివ్ గా ఉంటున్న కంటెస్టెంట్ శ్రీముఖి.  టాస్క్ లో ఆమె తీసుకునే ఇనిషియేషన్ అందరికీ తెలిసిందే. అయితే వాటి వల్లనే ఆమె మిగతా కంటెస్టెంత్స్  కి దూరం అవుతూ వస్తుంది. ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆమె రెండు తప్పులు చేసినట్టుగా కనబడుతుంది. మొదటగా రోహిణి విషయంలో ఆమె మొహం మీదే నువ్వు ఎలిమినేట్ అవుతావని చెప్పడం బాలేదు. ఎందుకంటే అటువంటి విషయాలు డైరెక్ట్ గా చెప్తే ఎవరినైనా చాలా బాధిస్తాయి.


వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుంది. ఏదైనా ఉంటే మనసులో దాచుకోవాలి గానీ, నేను ఓపెన్ గా ఉంటానని బయతకు చెప్తే అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అదీగాక నలుగురిలో ఆమె అలా అనడం చర్చనీయాంశమైంది. శ్రీముఖి అలా చేయడం తప్పే . శ్రీముఖే కాదు అలా ఎవరు చేసినా తప్పే. ఇంకోటి ఆలీ కెప్టెన్ అయ్యాక కంటెస్టెంత్స్ మధ్య ఏదైనా గొడవ వస్తే వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలని మధ్యలో థర్డ్ పర్సన్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. అపుడు రాహుల్, శ్రీముఖి ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు.


అపుడు శ్రీముఖి రాహుల్ తో మాట్లాడుతూ నేను నిన్ను సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని అంటుంది. రాహుల్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోనప్పటికీ ఆమె అలా అనడాన్ని తప్పుబడుతున్నారు. డిస్కషన్ పెట్టుకుని ఇద్దరి మధ్య దూరం తగ్గించుకోవాలనే ప్రయత్నించడం మానేసి ఆ దూరాన్ని ఇంకా పెంచేలానే చూస్తున్నట్టుగా శ్రీముఖి ప్రవర్తిస్తుందని విశ్లేషిస్తున్నారు. మరీ ఓపెన్ గా ఉండటం కంటే కొన్ని విషయాలని మనసులో దాచుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. శ్రీముఖి వ్యవహార శైలిపై ప్రేక్షకులు కోపం పెంచుకున్నారు. ముందు ముందు కూడా ఇలాగే ఉంటే ఆమెకు పెను ప్రమాదం తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: