టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అడివి శేష్, ఆ తరువాత కర్మ, కిస్ అనే సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. అయితే అవి ఆయనకు సక్సెస్ ని అందించలేదు. ఇక ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన శేష్ కు అవి కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని ఇచ్చాయి. ఆ తరువాత మెల్లగా తన పెన్ కి కూడా పదును పెట్టి క్షణం సినిమా కథను రూపొందించి, పివిపి సంస్థ నిర్మాణంలో రవికాంత్ దర్శకత్వంలో తానే హీరోగా నటించారు శేష్. అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ ని అందుకున్న ఆ సినిమా తరువాత, 

మరొక థ్రిల్లర్ గూఢచారి స్క్రిప్ట్ ని రూపొందించి నటించిన శేష్, మరొక సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక అక్కడినుండి ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. అవే పివిపి నిర్మాణంలో ఎవరు, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారి మేజర్, గూఢచారి2. అయితే వాటిలో ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా ఎవరు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, థ్రిల్లర్ మరియు సస్పెన్స్ అంశాలతో ఎంతో ఆకట్టుకుంది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీమియర్ షోని, నిన్న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో నిర్వహించడం జరిగింది. 

ఇక ఈ షో చూసిన పలువురు, సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, సినిమాలో వచ్చే ట్విస్టులు చాలా బాగున్నాయని, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, సినిమాకు అత్యంత కీలకమని అంటున్నారు. శేష్, రెజీనా, నవీన్ చంద్ర తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, ప్రేక్షకుడికి థ్రిల్ ని కలిగించేలా ఎంతో గ్రిప్పింగ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే, ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణగా వారు చెప్తున్నారు. మొత్తంగా నిన్నటి ప్రీమియర్ షో కు వచ్చిన అద్భుతమైన టాక్, నేడు రిలీజ్ కానున్న సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని ఎవరు సినిమా యూనిట్ భావిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, ఎవరు రూపంలో శేష్ కు మరొక సూపర్ హిట్ దక్కబోతోందని అంటున్నారు సినిమా విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: