శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వరుస విజయాలతో టాలీవుడ్ ని షేక్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. వరుస కామెడీ హిట్స్ సాధిస్తున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటి వరకు నటించని పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు..అదే ఆర్మీ ఆఫీసర్. ఇక చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది.
వరుస హిట్స్ తో తెలుగు వాళ్ల మనసు దోచిన కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల మహేష్ బాబు అన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మొదటి సారిగా పూర్తిగా కమర్షియల్, ఎంట్రటైన్ మెంట్ తో రావాలని అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా 'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
"భగ భగ భగ భగమండే... నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు... పెళ పెళ పెళ పెళమంటూ మంచుతుఫాను వచ్చినా, వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు... దడ దడ దడ దడమంటూ... తూటాలే దూసుకొచ్చినా... తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు... మారణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురుపంపేవాడు... ఒకడే ఒకడు వాడే సైనికుడు... సరిలేరు నీకెవ్వరూ... నువ్వెళ్లే రహదారికి జోహారు" అంటూ ఈ పాట సాగుతుంది.
ప్రస్తుతం దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా దాయాది దేశం మనపై నిప్పులు చెరుగుతుంటే..మన సైనికులు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి సైనిక నేపథ్యంలో సినిమా రావడం మహేష్ కి బాగా కలిసి వస్తుందని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.