టెంపర్ తర్వాత హిట్టు కోసం నానా తిప్పలు పడ్డ పూరి జగన్నాథ్ ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా హిట్ జోష్ తో ఉన్న పూరి మరో క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేశాడు.       


ప్రస్తుతం యువ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈమధ్యనే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ పూరితో సినిమా అనగానే ఆ ప్రాజెక్ట్ పై ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది.


పూరి సినిమాల్లో హీరోలా బయట తన ప్రవర్తన చూపించే విజయ్ దేవరకొండ హీరోగా పూరి డైరక్షన్ లో సినిమా అంటే కచ్చితంగా ఈ కాంబినేషన్ నుండి అదిరిపోయే సినిమా ఆశించవచ్చు. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో మరో కొత్తరకం క్యారక్టరైజేషన్ డిజైన్ చేసే పనిలో ఉన్నాడు పూరి జగన్నాథ్.  ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న ఇప్పుడు హీరోలతా పూరి డైరక్షన్ లో సూపర్ హిట్లు కొట్టిన వారే.  


మహేష్-పోకిరి, ప్రభాస్-బుజ్జిగాడు, రాం చరణ్-చిరుత, అల్లు అర్జున్-దేశముదురు, పవన్ కళ్యాణ్-బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు, ఎన్.టి.ఆర్-ఆంధ్రావాలా, టెంపర్ ఇలా అందరి స్టార్స్ తో ల్యాండ్ మార్క్ మూవీస్ అందించిన పూరి విజయ్ దేవరకొండతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఇస్మార్ట్ హిట్ తో పూరి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. దేవరకొండ లాంటి క్రేజీ హీరో దొరికాడు కాబట్టి పూరి ఈసారి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తాడో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: